తాళం వేసిన ఇళ్లల్లో చోరీ

ABN , First Publish Date - 2021-01-16T05:12:22+05:30 IST

తాళం వేసిన ఇళ్లల్లో చోరీ

తాళం వేసిన ఇళ్లల్లో చోరీ

మేడ్చల్‌: తాళం వేసిన ఇళ్లల్లో చోరీలు జరిగిన సంఘటనలు మేడ్చల్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్‌ మున్సిపల్‌ అత్వెల్లి రాఘవేంద్రానగర్‌ కాలనీలో తాళం వేసిన రెండు ఇళ్లల్లో దొంగలు తాళాలు పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. ఒక ఇంట్లో 13 తులాల బంగారు ఆభరణాలు, రెండున్నర లక్షల నగదుతో పాటు మరో ఇంటిలో వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. శుక్రవారం మధ్యాహ్నం ఇళ్ల యజమానులు తిరిగి వచ్చి చూసేసరికి తాళాలు పగులగొట్టి ఉండటంతో దొంగతనం జరిగినట్లు గ్రహించి పోలీసులకు సమాచారం అందించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 


తండ్రి కర్మకాండకు వెళ్లి వచ్చేసరికి..

కీసర రూరల్‌: తండ్రి కర్మకాండకు వెళ్లి వచ్చేసరికి ఇంట్లో సొత్తు చోరీకి గురైన ఘటన కీసర పోలీ్‌సస్టేషన్‌ పరిధి దమ్మాయిగూడ మున్సిపాలిటీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అహ్మద్‌గూడ రామలింగేశ్వర కాలనీకి చెందిన ఠాకూర్‌ సుజీత్‌ కుమార్‌ తన తండ్రి 10రోజుల కర్మకాండ నిర్వహించేందుకు స్వగ్రామమైన యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం మర్యాలుకు ఈనెల 13న కుటుంబసభ్యులతో వెళ్లారు. కార్యక్రమాలు ముగించుకుని శుక్రవారం ఉదయం ఇంటికి చేరుకున్నారు.  ఇంటి ప్రధానద్వారం తాళం పగులగొట్టి ఉండగా ఇంట్లోకి వెళ్లి చూడగా చోరీ జరిగినట్లు గుర్తించారు. బెడ్‌రూంలోని అల్మారాలో 2.7గ్రాముల బంగారు ఆభరణాలు, నగదు చోరీకి గురైనట్లు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నరేందర్‌గౌడ్‌ తెలిపారు. 

Updated Date - 2021-01-16T05:12:22+05:30 IST