మహిళ అదృశ్యం

ABN , First Publish Date - 2021-01-26T05:55:14+05:30 IST

మహిళ అదృశ్యం

మహిళ అదృశ్యం

ఘట్‌కేసర్‌ రూరల్‌: మతిస్థిమితం కోల్పోయిన మహిళ అదృశ్యమైన సంఘటన ఘట్‌కేసర్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ చంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం ఘట్‌కేసర్‌లోని కొర్రెములకు చెందిన జువ్వలక్ష్మి(49)కు మతిస్థిమితం లేకపోవడంతో ఇంటివద్దే ఉంటోంది. గతనెల 27న ఇంట్లో ఎవరూ లేని సమయంలో బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు తెలిసిన వారిని, బంధువులు, మిత్రులను విచారించినా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో వారు సోమవారం ఘట్‌కేసర్‌ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు.

Updated Date - 2021-01-26T05:55:14+05:30 IST