బండరాయితో మోది భర్తను హత్య చేసిన భార్య
ABN , First Publish Date - 2021-03-02T05:08:45+05:30 IST
బండరాయితో మోది భర్తను హత్య చేసిన భార్య
తాండూరు రూరల్: బండరాయితో మోది భర్తను భార్య చంపిన ఘటన సోమవారం జరిగింది. కొడంగల్ గ్రామానికి చెందిన కుర్వ మల్లేశం(42), కొన్నేళ్ల క్రితం భార్య పిల్లలతో కలిసి తాండూరు మండలం గౌతాపూర్ గ్రామంలో భార్య పుట్టింట్లోనే స్థిరపడ్డాడు. నిత్యం మద్యం తాగుతూ భార్య పిల్లలను వేధించేవాడు. ఈ క్రమంలో సోమవారం మద్యం తాగొచ్చి మెడలో ఉన్న నగలు ఇవ్వాలని భార్యను వేధించాడు. గమనించిన కొడుకు శివశంకర్ అడ్డుపడడంతో మల్లేశం అతనిపై బండరాయి వేయబోయాడు. భార్య బాలమణి వెంటనే భర్త చేతిలో నుంచి ఆరాయిని లాక్కొని భర్త మల్లేశం తలపై మోదగా తల పగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ, సీఐ జలంధర్రెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు.