వ్యక్తి అదృశ్యం
ABN , First Publish Date - 2021-11-24T05:24:07+05:30 IST
వ్యక్తి అదృశ్యం
![వ్యక్తి అదృశ్యం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
పరిగి: పరిగికి చెందని ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. గంజ్రో డ్డుకు చెందిన కొంగరి నర్సింహులు(43) ఈ నెల 17న బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. కాగా, నర్సింహులు భార్య ఆరునెలల క్రితం అతడిని వదిలివెళ్లింది. అప్పటి నుంచి మనస్తాపంలో ఉన్న అతడు ఎటో వెళ్లి ఉంటాడని తండ్రి నారాయణ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విఠల్రెడ్డి తెలిపారు.