పనులను త్వరగా పూర్తి చేయాలి
ABN , First Publish Date - 2021-04-17T05:03:18+05:30 IST
పనులను త్వరగా పూర్తి చేయాలి
మేడ్చల్ అర్బన్: జిల్లా వ్యాప్తంగా చేపడుతున్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ శ్వేతామహంతి అధికారులను ఆదేశింంచారు. శుక్రవారం ఆయా శాఖల అధికారులతో కలెక్టరేట్ నుంచి ఆమె వీడియో కాన్ఫరెన్స్లో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి మున్సిపాలిటీలో వైకుంఠధామాలు, ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్వెజ్ మార్కెట్ల నిర్మాణాలు ఏయే దశల్లో ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరు కొవిడ్- 19 నిబంధనలు పాటిస్తు విధులు నిర్వహించాలని చెప్పారు. ప్రకృతి వనాలు త్వరగా పూర్తిచేయాలని, డంప్ యార్డుల నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు నరసింహారెడ్డి, జాన్ శాంసన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.