కర్ణాటకలో స్వామిజీ కిడ్నాప్ కలకలం

ABN , First Publish Date - 2021-01-23T13:37:52+05:30 IST

కర్ణాటకలో అమ్మాజీ అనే స్వామిజీ కిడ్నాప్ కలకలం రేపుతోంది.

కర్ణాటకలో స్వామిజీ కిడ్నాప్ కలకలం

రంగారెడ్డి: కర్ణాటకలో అమ్మాజీ అనే స్వామిజీ కిడ్నాప్ కలకలం రేపుతోంది. కపిలాపూర్ గ్రామం బార్లీ జిల్లా నుండి స్వామిజీని దుండగులు కిడ్నాప్ చేశారు. భాస్కర్ రెడ్డి, సతీష్ అనే ఇద్దరు కిడ్నాపర్లు విమానంలో షిరిడి వెళ్దామని స్వామిజీ నమ్మించి ఓ కారులో హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. ఆపై హైదరాబాద్ నుండి శంషాబాద్ మీదుగా బెంగుళూరుకు తీసుకొని వెళ్లారు. ఓ గది లో స్వామిజీని బంధించి కిడ్నాపర్లు...రూ.20 కోట్ల నగదు, కిలో బంగారం లేకపోతే పది ఎకరాల వ్యవసాయం భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత నాలుగు రోజులుగా స్వామిజీని దుండగులు చిత్ర హింసలకు గురిచేశారు. సినీ పక్కిలో జరిగిన కిడ్నాప్ ఉదంతం జరిగింది. తాము డిమాండ్ చేసింది ఇవ్వకపోతే స్వామి కుటుంబాన్ని చంపేస్తానంటూ బెదిరింపులకు దిగారు. చివరకు రూ.5 కోట్లు ఇస్తానని ఒప్పుకోవడంతో స్వామిజీని తిరిగి హైదరాబాద్‌కు తీసుకున్నారు. కాగా హైదరాబాద్‌కు చేరుకోగానే గుండె నొప్పి వస్తుందంటూ నాటకమాడిన స్వామిజీ తనను వెంటనే ఆస్పత్రిలో చేర్పించాలని కోరారు. ఎట్టకేలకు కిడ్నాపర్ల గురించి వైద్యుని ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. కిడ్నాపర్లను పట్టుకొని లంగర్ హౌజ్ పోలీసులకు అప్పగించారు. అయితే కిడ్నాపర్లపై కనీసం కేసు నమోదు చేయకుండా లంగర్ హౌజ్ సీఐ వారిని వదిలిపెట్టారు. కావాలనే సీఐ కిడ్నాపర్లను వదిలేశాడని స్వామిజీ ఆరోపిస్తున్నారు. తన ప్రాణాలు అరచేతిల్లో పెట్టుకొని గత వారం రోజులుగా స్వామిజీ బిక్కు బిక్కుమంటూ గడిపారు. మానసికంగా, శారీరకంగా హింసించారు. ప్రస్తుతం స్వామి కిడ్నాప్ ఉదంతం తీవ్ర కలకలం సృష్టిస్తోంది.

Updated Date - 2021-01-23T13:37:52+05:30 IST