ఎన్నెన్నో వర్ణాలు..
ABN , First Publish Date - 2021-02-07T05:18:04+05:30 IST
సూర్యాస్తమయం సమయంలో భానుడు సప్త రంగులను

సూర్యాస్తమయం సమయంలో భానుడు సప్త రంగులను ఆకాశంలో ఆవిష్కృతం చేసి కనువిందు చేస్తుంటాడు. వివిధ వర్ణాలను వెదజల్లుతూ.. ప్రకృతి ప్రేమికులను ఆశ్చర్య పరుస్తుంటాడు. అలాంటి దృశ్యాలు శనివారం సాయంత్రం ఇబ్రహీంపట్నం, చేవెళ్ల మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయ సమీపంలో కనిపించాయి. ఆకాశంలో దర్శనమిచ్చిన పలు రంగుల కిరణాలను చూసి ప్రజలు సంబ్రమాశ్చర్యానికి లోనయ్యారు. పలువురు తమ కెమెరాల్లో ఆ దృశ్యాలను బంధించి ఆనందించారు.
- ఇబ్రహీంపట్న రూరల్, చేవెళ్ల