కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
ABN , First Publish Date - 2021-11-30T05:10:35+05:30 IST
కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
కొడంగల్/పరిగి: కొడంగల్ మండలం హస్నాబాద్, పర్సాపూర్గ్రామాల్లో ఎమ్మెల్యే నరేందర్రెడ్డి సోమవారం వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రెండు రోజుల్లో 3లక్షల గన్నీబ్యాగులు తెప్పిస్తామన్నారు. సివిల్ సప్లై గోదాంను కొనుగోలు, స్టాక్ పాయింట్కు అనుసంధానం చేశామన్నారు. రైతులు ఓపికతో ప్రభుత్వానికి సహకరించాలని, దళారులకు అమ్మవద్దని సూచించారు. సర్పంచ్లు సయ్యద్అంజద్, పకీరప్ప, ఎంపీపీ ముద్దప్పదేశ్ముఖ్, మధుసూదన్యాదవ్, దామోదర్రెడ్డి, మధుసూదన్యాదవ్ పాల్గొన్నారు. పరిగి ఏఎంసీ చైర్మన్ ఎ.సురేందర్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. వానకాలం వడ్లు మొత్తం కొంటామని, ఆందోళన చెందవద్దని సూచించారు.