విద్యార్థులు జాతి నిర్మాణంలో పాలుపంచుకోవాలి

ABN , First Publish Date - 2021-09-19T05:14:34+05:30 IST

విద్యార్థులు జాతి నిర్మాణంలో పాలుపంచుకోవాలి

విద్యార్థులు జాతి నిర్మాణంలో పాలుపంచుకోవాలి
విద్యార్థినికి మెరిట్‌ సర్టిఫికెట్‌ను అందజేస్తున్న గురునానక్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ వైస్‌చైర్మన్‌ కోహ్లి, ఎండీ సైనీ

ఇబ్రహీంపట్నం: ప్రతి విద్యార్థి బాధ్యతాయుంగా మెలుగుతూ జాతి నిర్మాణంలో పాలుపంచుకోవాలని గురునానక్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ వైస్‌చైర్మన్‌ జీ.ఎ్‌స.కోహ్లి అన్నారు. ఇబ్రహీంపట్నంలోని గురునానక్‌ విద్యాసంస్థలో గ్రాడ్యుయేషన్‌ డే నిర్వహించారు. జీఎన్‌ఐటీసీ, జీఎన్‌ఐటీలో పట్టభద్రులైన 1,200మంది విద్యార్థులకు శనివారం మెరిట్‌సర్టిఫికెట్లు, పట్టాలను అందజేశారు. ఆయన మాట్లాడుతూ పట్టభద్రులు చాలా మంది బహుళజాతి సంస్థల్లో ఉద్యోగాలు పొందారని, ఇది మంచి పరిణామమన్నారు. జీఎన్‌ఐటీసీ డైరెక్టర్‌ డా.ఎం.రామలింగారె డ్డి, జాయింట్‌ డైరెక్టర్‌ డా.పి.పార్థసారథి, జీఎన్‌ఐటీ ప్రిన్సిపాల్‌ డా.ఎ్‌స.శ్రీనాథరెడ్డి, అకడమిక్స్‌ డీన్‌ సంజీవ్‌ శ్రీవాస్తవ, అసోసియేట్‌ డైరెక్టర్లు, హెచ్‌వోడీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-19T05:14:34+05:30 IST