HYD: పీవీ ఎక్స్ప్రెస్ వేపై కారు బోల్తా
ABN , First Publish Date - 2021-11-01T14:01:15+05:30 IST
జిల్లాలోని రాజేంద్రనగర్ పీవీ ఎక్స్ప్రెస్వేపై ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది. 120 పిల్లర్ వద్ద కారు.. డివైడర్ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది.
రంగారెడ్డి: జిల్లాలోని రాజేంద్రనగర్ పీవీ ఎక్స్ప్రెస్వేపై ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది. వేగంగా దూసుకువచ్చిన కారు 120 పిల్లర్ వద్ద డివైడర్ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. రోడ్డుకు అడ్డంగా కారు పడిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. వెంటనే రాజేంద్రనగర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్లియర్ చేస్తున్నారు.