ఓఆర్ఆర్పై కారులో అకస్మాత్తుగా మంటలు...వ్యక్తికి గాయాలు
ABN , First Publish Date - 2021-07-22T17:43:10+05:30 IST
జిల్లాలోని శంషాబాద్ ఓఆర్ఆర్పై వెళ్తున్న ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది.
రంగారెడ్డి: జిల్లాలోని శంషాబాద్ ఓఆర్ఆర్పై వెళ్తున్న ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. కారు శంషాబాద్ నుండి గచ్చిబౌలి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కార్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కార్ నుండి బయటకు దిగేందుకు ప్రయత్నించిన వ్యక్తి మంటల్లో చిక్కుకొని గాయపడ్డాడు. అటు వైపు ప్రయాణిస్తున్న ఆటో, లారీ డ్రైవర్ వెంటనే అక్కడకు చేరుకుని వ్యక్తిని కారు నుంచి బయటకు తీశారు. ఆ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే శంషాబాద్లోని ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. గాయపడిన వ్యక్తి తిమ్మాపూర్కు చెందిన శ్రీనివాస్గా గుర్తించారు. తిమ్మాపూర్ నుండి గచ్చిబౌలికి తన సొంత వాహనంలో బయలుదేరిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంపై శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.