రెండేళ్ల కొడుకుని హత్య చేసిన తండ్రి
ABN , First Publish Date - 2021-07-13T17:19:45+05:30 IST
జిల్లాలోని మొయినాబాద్ దారుణం జరిగింది.
రంగారెడ్డి: జిల్లాలోని మొయినాబాద్ దారుణం జరిగింది. కన్న కొడుకన్న కనికరం లేని ఓ తండ్రి తన రెండేళ్ల కొడుకుని గొంతుకోసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం భార్యను కత్తితో పొడిచాడు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. కాగా దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.