ప్రతి ఒక్కరూ దైవభక్తిని అలవర్చుకోవాలి
ABN , First Publish Date - 2021-12-16T05:06:47+05:30 IST
ప్రతి ఒక్కరూ దైవభక్తిని అలవర్చుకోవాలి

యాచారం: ప్రతి ఒక్కరూ విధిగా దైవభక్తిని అలవర్చుకోవాలని, తద్వారా సమాజశాంతి నెలకొంటుందని ఎ మ్మెల్యే కిషన్రెడ్డి అన్నారు. యాచారం మండలం నల్లవెల్లిలో శ్రీకంఠమేశ్వరస్వామి విగ్రహాప్రతిష్ఠాపనలో పాల్గొని పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజంలో శాంతియుత వాతావరణం నెలకొనాలంటే విధిగా భగవంతుడ్ని ఆరాధించాలన్నారు. తాను సర్వమతాలను గౌరవిస్తానని, కులమతాలకతీతంగా పేదలకడగండ్లు తీ ర్చుతున్నట్టు చెప్పారు. నిత్యం స్వామి వారికి సేవలందించాలని ఆయన సూచించారు. నియోజకవర్గంలో ప్రతి ప ల్లెనూ అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న ట్లు చెప్పారు. జెడ్పీటీసీ చిన్నోళ్ల జంగమ్మ. ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిఇటీ మాజీ చైర్మన్ వెంకటరమణారెడ్డి, మా జీ జెడ్పీటీసీ రమే్షగౌడ్. ఎంపీటీసీ లక్ష్మీపతిగౌడ్, సొసైటీ వైస్ చైర్మన్ కారింగ్యాదయ్య, యాదయ్యగౌడ్, జెర్కోని రాజు, ఎండీ జావెద్ తదితరులు పాల్గొన్నారు.