కొత్త సాగు పద్ధతులను అవలంభించాలి

ABN , First Publish Date - 2021-09-04T05:14:38+05:30 IST

కొత్త సాగు పద్ధతులను అవలంభించాలి

కొత్త సాగు పద్ధతులను అవలంభించాలి
రైతులను సన్మానిస్తున్న శాస్త్రవేత్తలు

తాండూరు: రైతులు పంటలసాగులో కొత్తపద్ధతులను అవలంభించాలని తాండూరు  వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్‌ సుధాకర్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం 7వ ఆవిర్భావ దినోత్సవాన్ని శుక్రవారం తాండూరు ఏరువాక కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ రైతులకు బహుమతులు అందజేశారు. తాండూరు మండలం మల్కాపూర్‌ గ్రామానికి చెందిన జె.జ్యోతి, వికారాబాద్‌ మండలం ఎన్నెపల్లి గ్రామానికి చెందిన సిహెచ్‌.నగే్‌షలను ఉత్తమరైతులగా ఎంపిక చేసి వారిని సత్కరించారు. కార్యక్రమంలో ఏరువాక కేంద్రం ప్రధానశాస్త్రవేత్త డాక్టర్‌ ఎన్‌.ప్రవీణ్‌, సి.యమున, మానిక్యమిన్ని, డాక్టర్‌ సందీప్‌, రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.


Updated Date - 2021-09-04T05:14:38+05:30 IST