మందిర నిర్మాణానికి ముస్లిం విరాళం
ABN , First Publish Date - 2021-01-26T05:56:08+05:30 IST
మందిర నిర్మాణానికి ముస్లిం విరాళం
మొయినాబాద్/మొయినాబాద్ రూరల్: మొయినాబాద్ మండలం ముర్తుజగూడకు చెందిన మహ్మద్ ఖలీం అనే వ్యక్తి అయోధ్య రామమందిర నిర్మాణానికి రూ.5వేల విరాళాన్ని అందించారు. సోమవారం నిధి సేకరణలో భాగంగా క్షేత్రట్రస్ట్ సభ్యులు గ్రామానికి రాగా ఆయన వారికి ఈ మొత్తాన్ని అందజేశాడు. ఈ సందర్భంగా మహ్మద్ ఖలీం మాట్లాడుతూ... రామమందిర నిర్మాణానికి విరాళం ఇవ్వడం తనకు ఆనందంగా ఉందన్నారు. మత సామరస్యాన్ని చాటిచెప్పాలనే ఉద్దేశంతోనే మందిర్ ట్రస్ట్ నిధికి విరాళం ఇచ్చానని తెలిపారు. బీజేపీ మండల అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, ఆర్ఎ్సఎస్ నాయకుడు దశరథ్రెడ్డి మాట్లాడుతూ.. అయోధ్య రాయాలయం దేశ ప్రజలందరిదీ అనే విశ్వాసా న్ని కల్గించాలనే నిధి సేకరణ చేపట్టినట్టు పేర్కొన్నారు.