మేడ్చల్లో అక్రమంగా గోవుల తరలింపు
ABN , First Publish Date - 2021-03-01T13:20:47+05:30 IST
జిల్లాలోని శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మజీద్ పూర్ చౌరస్తా సమీపంలో రాజీవ్ రహదారిపై ఆవులను తరలింపును బీజేపీ, గోరక్ష నాయకులు అడ్డుకున్నారు.
మేడ్చల్: జిల్లాలోని మజీద్ పూర్ చౌరస్తా సమీపంలో రాజీవ్ రహదారిపై ఆవుల తరలింపును బీజేపీ, గోరక్ష నాయకులు అడ్డుకున్నారు. కరీంనగర్ నుండి నగరానికి లారీలో 50 గోవులను తరలిస్తున్న సమాచారం అందుకున్న గో రక్షదళ్ సభ్యులు ఈరోజు ఉదయం తుర్కపల్లి - మాజిద్పూర్ మధ్యలో పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. అక్రమంగా గోవులను తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.