మేడ్చల్లో వరుస దొంగతనాలు
ABN , First Publish Date - 2021-01-16T19:04:20+05:30 IST
జిల్లాలో వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. నాలుగు రోజుల వ్యవధిలో 7 ఇండ్లలో 3 దొంగతనాలు జరిగాయి.
మేడ్చల్: జిల్లాలో వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. నాలుగు రోజుల వ్యవధిలో 7 ఇండ్లలో 3 దొంగతనాలు జరిగాయి. మేడ్చల్ పట్టణంలోని పద్మావతి అపార్ట్మెంట్లో శుక్రవారం అర్ధరాత్రి మూడు ఇళ్లలో దుండగులు చోరీకి తెగబడ్డారు. దాదాపు రెండు తులాల బంగారం, ఐదు తులాల వెండి, తొమ్మిది వేల నగదును అపహరించారు. ఈనెల 12న సూర్యనగర్లో ఐదు ఇళ్ళు, 15న రాఘవేంద్ర కాలనీలో చోరీ జరిగింది. తాజాగా ఈ రోజు పద్మావతి అపార్ట్మెంట్లో దుండగులు చోరీ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.