రూ.2లక్షల విలువైన మద్యం స్వాధీనం
ABN , First Publish Date - 2021-01-27T05:23:08+05:30 IST
రూ.2లక్షల విలువైన మద్యం స్వాధీనం
యాచారం: మండల పరిధి మేడిపల్లిలో మంగళవారం పోలీసులు రూ.2లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకొని దుకాణాదారుడిని అరెస్టు చేశారు. గ్రామంలో నాగరాజు అనే యువకుడు కిరాణ దుకాణం నడుపుతూ మద్యం అమ్ము తున్నాడని సీఐ లింగయ్య, ఎస్సై ప్రభాకర్ తెలిపారు. తమ దాడిలో మద్యం పట్టుబడిందన్నారు. నాగరాజు గతంలోనూ అక్రమంగా మద్యం అమ్ముతూ పట్టుబడ్డాడని పోలీసులు తెలి పారు. కేసు నమోదు చేసి మద్యంతో పాటు నాగరాజును ఎక్సై జ్ అధికారులకు అప్పగించినట్లు సీఐ వివరించారు.