మహనీయుల జయంతి ఉత్సవాలను నిర్వహించాలి
ABN , First Publish Date - 2021-03-22T05:58:50+05:30 IST
మహనీయుల జయంతి ఉత్సవాలను నిర్వహించాలి
![మహనీయుల జయంతి ఉత్సవాలను నిర్వహించాలి](https://media.andhrajyothy.com/appimg/galleries/2021032212271784/03222021002843n82.jpg)
మొయినాబాద్ : ప్రతి సంవత్సరం ఏప్రిల్లో మహనీయుల జయంతి ఉత్సవాలు నిర్వహించాలని ఉత్సవాల కమిటీ చైర్మన్ బేగరి రాజు అన్నారు. ఆదివారం పద్మావతి గార్డెన్లో మహనీయుల జయంతి ఉత్సవాల కమిటీ సమవేశం నిర్వహించారు. ఏప్రిల్ నెల మహనీయుల మాసం అని, అంబేద్కర్, జగ్జీవన్రామ్, జ్యోతిబాపూలే, ఇతర మహనీయుల జయంతి ఈ నెలలోనే వస్తాయన్నారు. వైస్చైర్మన్ కుమార్, ప్రఽధాన కార్యదర్శి భాస్కర్, సునీల్, కుమార్, మల్లేశ్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.