ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
ABN , First Publish Date - 2021-08-28T04:22:43+05:30 IST
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
![ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
- ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి
ఆమనగల్లు : రాష్ట్రాభివృద్ధి, పేదరిక నిర్మూలన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆమనగల్లు, కడ్తాల, తలకొండపల్లి, మాడ్గుల మండలాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.2.10 లక్షల చెక్కులను శుక్రవారం నగరంలోని తన నివాసంలో బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బిక్కునాయక్, నర్సింహ్మగౌడ్, క్రిష్ణ, సురేందర్ రెడ్డి, బాబా, భాస్కర్ రెడ్డి, శేఖర్గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, యాదగిరి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.