సేవ చేస్తామని స్వచ్ఛంద సంస్థ మోసం
ABN , First Publish Date - 2021-03-24T05:43:14+05:30 IST
సేవ చేస్తామని స్వచ్ఛంద సంస్థ మోసం

- వృద్ధుల ఇంటిని లీజుకిచ్చేందుకు యత్నం
శంషాబాద్: కేరళ రాష్ట్రానికి చెందిన వృద్ధ దంపతులు డాక్టర్ సి.ఫ్రాన్సిస్, లూసీ 20ఏళ్ల క్రితం శంషాబాద్లో స్థిరపడ్డారు. వీరు కేరళలో స్వచ్ఛంద సంస్థను నడిపారు. శంషాబాద్లోనూ సేవలందించాలని మధురానగర్ బస్తీలో 533 గజాల్లో ఉన్న తమ ఇంటిని జీసెస్ మేరీ జోసెఫ్ అనే సంస్థకు 2016లో గిఫ్ట్ డీడ్ చేశారు. ఇప్పుడాసంస్థ భవనాన్ని లీజుకిచ్చేందుకు చూస్తోందని ఫ్రాన్సిస్ మంగళవారం ఆంధ్రజ్యోతితో వాపోయారు. రూ.6కోట్ల విలువైన భవనాన్ని దుర్వినియోగం చేసేందుకు యత్నిస్తున్నారని తెలిపారు. ప్రజా సేవ చేస్తారని ఇంటిని ఇచ్చి మోసపోయిన తమకు సామాజిక కార్యకర్తల అండకావాలని విజ్ఞప్తి చేశారు. సంస్థపై న్యాయపోరాటం చేస్తామని తెలిపారు.