మృతుడి భార్యకు ఆర్థికసాయం అందజేత
ABN , First Publish Date - 2021-10-15T05:17:43+05:30 IST
మృతుడి భార్యకు ఆర్థికసాయం అందజేత
తాండూరు రూరల్: మల్కాపూర్ సమీపంలో ఇటీవల హత్యకు గురైన రామప్ప భార్యకు ఐసీఎల్ యాజమాన్యం రూ.4లక్షల సాయాన్ని అందజేసింది. గురువారం రూరల్ సీఐ డి.జలందర్రెడ్డి చేతుల మీదుగా చెక్కును అందజేశారు. ఐసీఎల్ కార్మికుడే హత్య చేశాడని నిర్ధారణ కావడంతో కర్మాగార యాజమాన్యం ఈ మేరకు పరిహారాన్ని ప్రకటించింది. కుటుంబాన్ని ఆదుకునేందుకు రూ.4లక్షలు అందజేసింది. ఈ కార్యక్రమంలో గని కార్మిక సంఘం డైరెక్టర్లు పండరి, నర్సింహులు, మాజీ ఎంపీటీసీ రఘునాథ్రెడ్డి, వడ్ల మల్లేశం, ఉపాధ్యాయుు కిష్టప్ప, శ్రీనివాస్ పాల్గొన్నారు.