డ్రైవర్‌ నిర్లక్ష్యం.. క్లీనర్‌ మృతి

ABN , First Publish Date - 2021-10-26T04:15:20+05:30 IST

డ్రైవర్‌ నిర్లక్ష్యం.. క్లీనర్‌ మృతి

డ్రైవర్‌ నిర్లక్ష్యం.. క్లీనర్‌ మృతి

నందిగామ: డ్రైవర్‌ నిర్లక్ష్యంతో క్లీనర్‌ మృతి చెందిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం లారీలో వరిపొట్టును నింపుకుని మండల శివారులోని నవదుర్గ టెక్స్‌టైల్‌ పరిశ్రమకు వెళ్తూ తహసీల్దార్‌ కార్యలయం సమీపంలో లారీని ఆపి డ్రైవర్‌, క్లీనర్‌ విశ్రాంతి తీసుకున్నారు. ఈ క్రమంలో క్లీనర్‌ యోగేంద్ర భరత్‌(55) లారీ క్రింద పడుకున్నాడు. డ్రైవర్‌ గమనించకుండా లారీని తీయడంతో టైర్ల కింద పడి యోగేంద్ర అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి స్వస్థలం బీహార్‌ రాష్ట్రం. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ రామయ్య తెలిపారు.


Updated Date - 2021-10-26T04:15:20+05:30 IST