యాదాద్రికి కిలో బంగారం విరాళం
ABN , First Publish Date - 2021-10-30T04:52:36+05:30 IST
యాదాద్రికి కిలో బంగారం విరాళం
- ప్రకటించిన ఎమ్మెల్యే మహేశ్రెడ్డి
పరిగి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయ విమాన గోపురానికి స్వర్ణం తాపడానికి కిలోబంగారాన్ని విరాళంగా ఇస్తానని పరిగి ఎమ్మెల్యే కె.మహేశ్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరిగి నియోజకవర్గం తరఫున కిలోబంగారాన్ని త్వరలోనే దేవాలయ కమిటీకి అందజేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.