కొవిడ్‌ టీకా కోసం జనం బారులు

ABN , First Publish Date - 2021-08-28T04:37:27+05:30 IST

కొవిడ్‌ టీకా కోసం జనం బారులు

కొవిడ్‌ టీకా కోసం జనం బారులు
ప్రభుత్వాసుపత్రిలో టీకా కోసం గుమిగూడిన ప్రజలు

చేవెళ్ల : కరోనా నియంత్రణలో భాగంగా శుక్రవారం చేవెళ్ల ప్రభుత్వ సివిల్‌ ఆసుపత్రిలో వ్యాక్సిన్లు వేశారు. వర్షాన్ని లెక్క చేయకుండా వివిధ గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చారు. క్యూలో నిలబడి వ్యాక్సిన్లు వేసుకున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు రావడంతో భౌతిక దూరం కొరవడింది. మొత్తం 100 మందికి వ్యాక్సిన్‌ వేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ తెలిపారు.


Updated Date - 2021-08-28T04:37:27+05:30 IST