పత్తి రైతుల ధర్నా
ABN , First Publish Date - 2021-01-20T06:10:13+05:30 IST
పత్తి రైతుల ధర్నా

పూడూరు: ఆన్లైన్లో లేని పత్తిని కొనలేమని అధికారులు చెప్తుండటంతో పూడూరు మండలం కెరవెళ్ళి గ్రామానికి చెందిన రైతులు మంగళవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. గత నాలుగేళ్ళుగా తమ భూమిని ఆన్లైన్లో నమోదు చేయాలని తిరిగినా పట్టించుకోలేదని వాపోయారు. రైతులు పంటలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్ముకునేలా చూడకుండా ఇలా నిలిపివేయడం ఏమిటని రైతులు అధికారులను, తహసీల్దార్ను నిలదీశారు. పంటను కొనుగోలు చేసేలా చూస్తామని తహసీల్దార్ కిరణ్ రైతులకు హామీ ఇచ్చారు.