గుట్కాలు పట్టివేత

ABN , First Publish Date - 2021-01-27T05:42:50+05:30 IST

గుట్కాలు పట్టివేత

గుట్కాలు పట్టివేత

ఘట్‌కేసర్‌ రూరల్‌: గుట్కాలను విక్రయిస్తున్న ఓ వ్యక్తిని ఘట్‌కేసర్‌ పోలీసులు అదుపులోకి తీసుకొని గుట్కాలను స్వాధీనం చేసుకున్నారు. సీఐ ఎన్‌.చంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్‌కేసర్‌లోని రామ్‌నగర్‌కు చెందిన బొడ్ల సాగర్‌ తన ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా గుట్కాలను విక్రయిస్తున్నానే పక్కా సమాచారంతో సోమవారం రాత్రి పోలీసులు దాడిచేశారు. ఈ దాడిలో దాదాపు రూ.40వేల విలువ గల గుట్కాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు.

Updated Date - 2021-01-27T05:42:50+05:30 IST