పంచాయతీ కార్యదర్శిపై పోలీ్సస్టేషన్లో ఫిర్యాదు
ABN , First Publish Date - 2021-10-30T04:20:02+05:30 IST
పంచాయతీ కార్యదర్శిపై పోలీ్సస్టేషన్లో ఫిర్యాదు
శంషాబాద్ రూరల్: పెద్దషాపూర్ తండా పంచాయతీ కార్యదర్శి సక్కుబాయిపై శుక్రవారం లంబాడీ సేన రాష్ట్ర అధ్యక్షుడు కేతావత్ రామునాయక్ శంషాబాద్ రూరల్ పోలీ్సస్టేషన్ మరియు ఎంపీడీవో వినయ్కుమార్కు లిఖిత పూర్వకంగా ఫిర్యా దు చేశారు. విధుల్లో నిర్లక్ష్యం చేయడంతో పాటు అక్రమ నిర్మాణాల పట్ల ఉదాసీనతగా వ్యవహరించడంతో ఈనెల 20వ తేదీన జిల్లా పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేశారు. పారిశుధ్య పనులు, అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం లేదని ఈనెల 25న సర్పంచ్ నీలనాయక్ మరోసారి ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు.