వైభవంగా రథోత్సవం
ABN , First Publish Date - 2021-03-25T04:28:53+05:30 IST
వైభవంగా రథోత్సవం

మేడ్చల్ : మేడ్చల్ రామలింగేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం తెల్లవారుఝామున స్వామివారి రథోత్సవాన్ని బాణాసంచాలు కాల్చుతూ, భాజాభజంత్రీల నడుమ కనులపండువగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త కాశీనాథ్, భక్తులు భారీగా హాజరయ్యారు. సాయంత్రం జాతర ప్రారంభమైంది.