పసుపు పంటలో గంజాయి సాగు

ABN , First Publish Date - 2021-10-30T04:18:32+05:30 IST

పసుపు పంటలో గంజాయి సాగు

పసుపు పంటలో గంజాయి సాగు

బంట్వారం (కోట్‌పల్లి): పసుపు పంటలో  పెంచిన గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన కోట్‌పల్లి పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ తిరుపతిరాజు, ఎస్‌ఐ ఆనంద్‌ తెలిపిన వివరాల ప్రకారం కోట్‌పల్లి మండలం ఎన్నారం గ్రామానికి చెందిన  రైతు మందుల జనార్ధన్‌ సర్వేనెంబర్‌ 7లోని తన పొలంలో పసుపు, కంది పంటలు సాగు చేశాడు.  వీటితో పాటు గంజాయిమొక్కలను కూడా పెంచుతున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు శుక్రవారం పంటచేలను పరిశీలించారు. పొలంలో 61 గంజాయి మొక్కలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. జనార్ధన్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Updated Date - 2021-10-30T04:18:32+05:30 IST