సుల్తాన్నగర్లో కందిపంట దగ్ధం
ABN , First Publish Date - 2021-02-07T04:57:07+05:30 IST
సుల్తాన్నగర్లో కందిపంట దగ్ధం

పరిగిరూరల్: పరిగి మునిసిపల్ పరిధిలోని సుల్తాన్నగర్లో శనివారం కందిపంట దగ్ధమైంది. సుల్తాన్గర్కు చెందిన షఫీ, ఫయాజ్లు అనే రైతులు కౌలుకు పంటలను పండించారు. కల్లం ఎండబెట్టిన కందిపంట, నాలుగు ట్రాక్టర్ మొక్కజొన్న పొట్టు దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికే పంట కాలిబూడిదయిపోయింది. దాదాపుగా రూ.లక్ష పైగా నష్టం జరిగిందని బాధితులు తెలిపారు.