భగీరథ పనులు పూర్తిచేయాలి
ABN , First Publish Date - 2021-05-21T04:52:28+05:30 IST
భగీరథ పనులు పూర్తిచేయాలి

శంషాబాద్ రూరల్: మిషన్ భగీరథ పనులు త్వరగా పూర్తిచేయాలని నర్కూడ సర్పంచ్ సున్నిగంటి సిద్దులు అధికారులకు సూచించారు. గతంలో భగీరథ పైపులైన్లు వేసిన అధికారులు ఇప్పటివరకూ ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇవ్వలేదు. కాగా కనెక్షన్ కోసం గ్రామంలో గత నాలుగు రోజులుగా అధికారుల సమక్షంలో పనులు ప్రారంభించారు. త్వరలో పనులు పూర్తి చేస్తామని ఆర్డబ్ల్యూఎస్ ఏఈ సూర్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి తదితరులున్నారు.