బ్యాంకు మేనేజర్‌పై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2021-06-22T05:24:19+05:30 IST

బ్యాంకు మేనేజర్‌పై చర్యలు తీసుకోవాలి

బ్యాంకు మేనేజర్‌పై చర్యలు తీసుకోవాలి
వినతిపత్రం అందజేస్తున్న సీపీఎం నాయకులు

తాండూరు రూరల్‌: రైతుబంధు డబ్బులు ఇవ్వకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న బ్యాంకు మేనేజర్‌పై చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.శ్రీనివాస్‌ సోమవారం తాండూరు తహసీల్దార్‌ చిన్నప్పలనాయుడుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ తాండూరు మండల పరిధిలోని గ్రామాల రైతులకు ప్రభుత్వం రైతుబంధు డబ్బులు వేసినప్పటికీ, అట్టి డబ్బులు తీసుకోకుండా రైతులఖాతాలను హోల్డ్‌లో పెట్టి బ్యాంకు మేనేజర్‌ రైతులను తీవ్రఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. వెంటనే రైతులకు రైతుబంధు డబ్బులు చెల్లించే విధంగా అధికారులు, ఎమ్మెల్యే, మంత్రులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.  సీపీఎం నాయకులు మహేష్‌, నర్సింహులు, రైతులు నరేంద్రప్ప, నర్సప్ప, మల్లేష్‌, గౌరిశంకర్‌, అక్బర్‌, సంతోష్‌, వెంకటప్ప, నర్సింహులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-22T05:24:19+05:30 IST