మహిళ కడుపులోంచి 5కిలోల కణితి వెలికితీత
ABN , First Publish Date - 2021-05-08T05:36:20+05:30 IST
మహిళ కడుపులోంచి 5కిలోల కణితి వెలికితీత

శామీర్పేట : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్పేట మండలం తుర్కపల్లిలోని గ్రీన్లై్ఫ ప్రైవేట్ ఆసుపత్రిలో డాక్టర్ అఫ్రీన్ సుల్తానా ఆధ్వర్యంలోని వైద్య బృందం నస్రీన్(33) అనే మహిళ కడుపులో నుంచి దాదాపు 5 కిలోల కణితిని విజయవంతంగా తొలగించారు. కాగా నస్రీన్ అనే మహిళ గత రెండు సంవత్సరాల నుంచి కడుపు నొప్పితో బాధపడుతూ ఎన్నో ఆసుపత్రులు తిరిగినా సమస్య పరిష్కారం కాలేదని, సదరు మహిళ ఆసుపత్రికి వచ్చిన వెంటనే సమస్యను గుర్తించి శస్త్రచికిత్స ద్వారా కణితిని తొలగించినట్లు వైద్యులు తెలిపారు.