39 గంజాయి ప్యాకెట్లు స్వాధీనం
ABN , First Publish Date - 2021-10-29T04:44:11+05:30 IST
ఆమనగల్లు మండలం మేడిగడ్డ తండా, షాద్నగర్లో

ఆమనగల్లు / షాద్నగర్రూరల్ : ఆమనగల్లు మండలం మేడిగడ్డ తండా, షాద్నగర్లో 39 గంజాయి ప్యాకెట్లు పట్టుబడ్డాయి. వివరాలు ఇలా ఉన్నాయి. ఆమనగల్లు మండలపరిధిలోని మేడిగడ్డ తండాలో 17ఏళ్ల యువకుడు గంజాయి అమ్ముతున్నాడని పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్ఐ ధర్మేశ్తో కలిసి సీఐ ఉపేందర్ మేడిగడ్డ గేటు వద్ద వాహనాల తనిఖీలో భాగంగా అనుమానంగా తిరుగుతున్న యువకుడిని పట్టుకొని విచారించారు. అతని వద్ద 250 గ్రాముల 20 గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయి. వెల్దండ మండలానికి చెందిన మహేశ్ అనే వ్యక్తి దగ్గర వాటిని కొనుగోలు చేసి విక్రయిస్తున్నట్లు పట్టుబడిన యువకుడు పేర్కొన్నట్లు సీఐ తెలిపారు. సంఘటన స్థలాన్ని క్లూస్ టీం, రెవెన్యూ అధికారులు సందర్శించి వివరాలు సేకరించారు. గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. గంజాయి సరఫరా చేస్తున్న మహేశ్తో పాటు మరికొందరు వ్యక్తులు పరారీలో ఉన్నట్లు తెలిపారు.
షాద్నగర్లో..
గుట్టుచప్పుడు కాకుండా గంజాయి విక్రయిస్తున్న యువకుడిని గురువారం పోలీసులు అరెస్టు చేశారు. షాద్నగర్ పట్టణంలోని పటేల్రోడ్డులో నివాసముంటూ హమాలీ పనిచేసే శివ(30) అనే యువకుడు గంజాయి అమ్ముతున్నట్లు సమాచారం అందడంతో దాడిచేసి అతన్ని పట్టుకున్నామని ఇన్స్పెక్టర్ నవీన్కుమార్ తెలిపారు. అతని వద్ద ఉన్న 19 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.