కుర్నాపల్లిలో యువతి అదృశ్యం
ABN , First Publish Date - 2021-01-03T05:26:46+05:30 IST
ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామంలో యువతి (18) అదృశ్యమైనట్లు ఎస్ఐ ఎల్లా గౌడ్ తెలిపారు.
ఎడపల్లి, జనవరి 2: ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామంలో యువతి (18) అదృశ్యమైనట్లు ఎస్ఐ ఎల్లా గౌడ్ తెలిపారు. ఈమె డిసెంబరు 26న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదని ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారన్నారు. ఈ మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.