అశోక్‌సాగర్‌ చెరువులో మహిళ మృతదేహం లభ్యం

ABN , First Publish Date - 2021-12-30T06:47:02+05:30 IST

మండలంలోని జానకంపేట్‌ గ్రామ శివారు ప్రాంతంలోని అశోక్‌సాగర్‌ చెరువులో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. అశోక్‌సాగర్‌ బోటింగ్‌ పాయింట్‌ సమీప ప్రాంతంలో శవం తేలింది.

అశోక్‌సాగర్‌ చెరువులో మహిళ మృతదేహం లభ్యం

ఎడపల్లి, డిసెంబర్‌ 29: మండలంలోని జానకంపేట్‌ గ్రామ శివారు ప్రాంతంలోని అశోక్‌సాగర్‌ చెరువులో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. అశోక్‌సాగర్‌ బోటింగ్‌ పాయింట్‌ సమీప ప్రాంతంలో శవం తేలింది. నిజామా బాద్‌ రూరల్‌ 6వ ఠాణ ఎస్సై ఆంజనేయులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. గత ఈతగాళ్ల సహాయంతో మహిళ మృతదేహాన్ని బయటకు తీయించి శవ పంచ నా మా నిర్వహించారు. మృతురాలు 45నుంచి 50 సంవ త్సరాల మధ్య వయస్సు, జిల్లా కేంద్రంలోని కసాబ్‌ గల్లీ ప్రాంతానికి చెందిన ఎగిశాల స్వరూప నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతురాలి కోడలు ఇచ్చి న ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న ట్లు ఎస్సై తెలిపారు. 

Updated Date - 2021-12-30T06:47:02+05:30 IST