పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
ABN , First Publish Date - 2021-10-20T04:40:27+05:30 IST
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు.
కామారెడ్డి, అక్టోబరు 19: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. మంగళవారం గాంధీగంజ్లో పరిసరాలను మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గ్యారలక్ష్మీ సాయిలు, వైస్ చైర్మన్ కుంబాల రవియాదవ్తో కలిసి శుభ్రపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు తమ ఇళ్లతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించా రు. పరిశుభ్రత పాటిస్తే వ్యాధులు రావని పేర్కొన్నారు. ఆజాద్కా అమృత్ మహోత్సవ్ క్లీన్ ఇండియాలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ దేవేందర్, కౌన్సిలర్ అపర్ణ తదితరులు పాల్గొన్నారు.