మహిళను కాపాడిన పోలీసులు

ABN , First Publish Date - 2021-08-26T05:04:50+05:30 IST

నిజాంసాగర్‌ ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చిన మహిళ(28)ను నిజాంసాగర్‌ పోలీసులు బుధవారం కాపాడారు.

మహిళను కాపాడిన పోలీసులు

 కౌన్సెలింగ్‌ చేసి సోదరుడికి అప్పగింత 

నిజాంసాగర్‌, ఆగస్టు 25: నిజాంసాగర్‌ ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చిన మహిళ(28)ను నిజాంసాగర్‌ పోలీసులు బుధవారం కాపాడారు. వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌ జిల్లాలోని జీడిమెట్ల మండలంలోని సుభాష్‌ నగర్‌కు చెందిన దుర్గంగారి వినోద (28) నిజాంసా గర్‌ ప్రాజెక్టు 16 గేట్ల వద్ద దూకేందుకు ప్రయత్నించగా స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమెను పట్టుకుని పోలీసు స్టేషన్‌కు తీసుకుని వచ్చారు. పెద్దశంకరంపేట మండలంలోని గోపాన్‌ వెంక టాపూర్‌ గ్రామానికి చెందిన దుర్గంగారి వినోదను సుభాష్‌ నగర్‌కు చెందిన విక్రంకు ఇచ్చి వివాహం జరిపించారు. హైదరాబాద్‌లో భర్తతో జీవనం గడిపి న వినోద తల్లిగారి ఊరు గోపాన్‌ వెంకటాపూర్‌కు వచ్చింది. ఆత్మహత్యకు యత్నించగా పోలీసులు కౌన్సెలింగ్‌ చేసి అన్న మన్నె సాయిలుకు అప్పగిం చారు. కార్యక్రమంలో ఎస్సై హైమద్‌, కానిస్టేబుళ్లు రాజు, వీరభద్రంలున్నారు.

Updated Date - 2021-08-26T05:04:50+05:30 IST