నగరంలో నేడు జాతీయ లోక్ అదాలత్
ABN , First Publish Date - 2021-04-10T05:39:01+05:30 IST
నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాల జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కిరణ్మయి తెలిపారు.
నిజామాబాద్లీగల్, ఏప్రిల్ 9: నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాల జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కిరణ్మయి తెలిపారు. ఆర్మూర్, బోధన్, బిచ్కుంద, బాన్సూవాడ, ఎల్లారెడ్డితో పాటు నిజామాబాద్ జిల్లా కోర్టు ప్రాంగణంలో లోక్ అదాలత్ నిర్వాహణకు 21 బెంచీలను ఏర్పాటు చేశామని ఆమె వివరించారు. రాజీపడదగిన క్రిమినల్, సివిల్ కేసులు అందరు కక్షిదారులు సమ్మతిమేరకు పరిష్కరిస్తున్నామని కోవిడ్ నిబంధనలకు కక్షిదారులు సహకరించగలరని లోక్ అదాలత్ విజయవంతానికి సహకరించాలని తెలిపారు.