ఇంటింటి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2021-05-22T04:34:20+05:30 IST

కరోనా మహమ్మారీని అరికట్టేందుకు చేపడుతున్న ఇంటింటి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని ఆర్డీవో రాజాగౌడ్‌ తెలిపారు.

ఇంటింటి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి


నిజాంసాగర్‌, మే 21 : కరోనా మహమ్మారీని అరికట్టేందుకు చేపడుతున్న ఇంటింటి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని ఆర్డీవో రాజాగౌడ్‌ తెలిపారు. శుక్రవారం నిజాంసాగర్‌ మండలం కొమలంచ గ్రామాన్ని సందర్శించారు. కరోనా కట్టడికి నిర్వహిస్తున్న సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా లక్షణాలున్న వారిని గుర్తించి వారికి తక్షణమే మందులను పంపిణీ చేయాలన్నారు. గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పది రోజుల్లోగా నిల్వ ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేసి కేంద్రాలను మూసి వేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామాల్లో కరోనా లక్షణాలున్న వారికి కరోనా కిట్లను అందజేశారు. ఆయన వెంట తహసీల్దార్‌ వేణుగోపాల్‌, నాయకులు సత్యనారాయణ, తదితరులున్నారు.  

Updated Date - 2021-05-22T04:34:20+05:30 IST