విద్యార్థులు పోటీతత్వాన్ని అలవర్చుకోవాలి
ABN , First Publish Date - 2021-12-29T04:50:49+05:30 IST
విద్యార్థులు పోటీతత్వాన్ని అలవర్చుకోవాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. మంగళవారం గాంధారి మండలంలోని ఏకలవ్య గురుకుల పాఠశాలను పరిశీలించారు.
![విద్యార్థులు పోటీతత్వాన్ని అలవర్చుకోవాలి](https://media.andhrajyothy.com/appimg/galleries/1921122811171260/12282021231837n89.jpg)
కలెక్టర్ జితేష్ వి.పాటిల్
గాంధారి, డిసెంబరు 28: విద్యార్థులు పోటీతత్వాన్ని అలవర్చుకోవాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. మంగళవారం గాంధారి మండలంలోని ఏకలవ్య గురుకుల పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. విద్యార్థులు పోటీ పరీక్షలు రాసి విజేతగా నిలవాలని ఆకాంక్షించారు. క్రీడా మైదానాన్ని పరిశీలించారు. ఫుట్బాల్, ఆర్చరీ, బాస్కెట్బాల్ కోర్టులను ఏర్పాటు చేయాలని ప్రిన్సిపాల్ను కోరారు. విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో రాణించే విధంగా వ్యాయా మ ఉపాధ్యాయులు చూడాలని అన్నారు. పాఠశాలను దత్తత తీసుకున్నందున దశలవారీగా పాఠశాలకు వచ్చి మౌలిక వసతుల కల్పన కోసం కృషి చేస్తానని తెలిపారు. అంతకుముందు విద్యార్థులు కలెక్టర్కు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సంజీవ్, తహసీల్దార్ గోవర్ధన్ అఽధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు.