గంజాయిని విక్రయిస్తే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2021-10-26T04:54:21+05:30 IST

గంజాయి, గుట్కాలను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని, పీడీ యాక్టు కింద కేసు నమోదు చేస్తామని బాన్సు వాడ డీఎస్పీ జైపాల్‌ రెడ్డి అన్నారు.

గంజాయిని విక్రయిస్తే కఠిన చర్యలు


బాన్సువాడ, అక్టోబరు 25 :
గంజాయి, గుట్కాలను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని, పీడీ యాక్టు కింద కేసు నమోదు చేస్తామని బాన్సు వాడ డీఎస్పీ జైపాల్‌ రెడ్డి అన్నారు. పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు గంజాయి, గుట్కాలపై ప్రత్యేక బృందాల ద్వారా నిఘాను ఏర్పాటు చేస్తున్నామన్నారు. గుట్కాలపై సీఐలు, ఎస్సైల ఆధ్వర్యంలో పోలీసులతో 26 టీంలుగా ఏర్పడి దాడులు చేయడంతో పాటు తొమ్మిది కేసులు నమోదు చేశామన్నారు. గంజాయి, గుట్కాలపై ఎవరైనా సమాచారం అందిస్తే వారి పేర్లను గోప్యంగా ఉంచుతామ న్నారు. యువత చెడు అలవాట్లకు బానిసై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోరాదన్నారు. గంజాయి సంబంఽధించి జుక్కల్‌లో 3 కేసులు, పెద్ద కొడప్‌గల్‌లో 1 కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

Updated Date - 2021-10-26T04:54:21+05:30 IST