రెండో రోజు పల్స్ పోలియో 7.33 శాతం
ABN , First Publish Date - 2021-02-02T05:15:09+05:30 IST
జిల్లాలో పల్స్పోలియో విజయవంతమైందని డీఎంహెచ్వో డాక్టర్ సుదర్శనం తెలిపారు.

పెద్దబజార్, ఫిబ్రవరి 1: జిల్లాలో పల్స్పోలియో విజయవంతమైందని డీఎంహెచ్వో డాక్టర్ సుదర్శనం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1,83,220 పిల్ల లకుగాను మొదటి రోజు 1,70,013 (92.79 శాతం), రెండో రోజు 13,429 చిన్నారులకు (7.33 శాతం) మందికి పల్స్పోలియో చుక్కలు వేసినట్లు తెలిపారు. ఎ వరైనా పిల్లలు అందుబాటులో లేనివారు మంగళవారం ఏఎన్ఎంలు, అంగన్ వాడీలు, ఆశావర్కర్లు ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేయనున్నట్లు తె లిపారు. జిల్లా వ్యాప్తంగా 1700 కేంద్రాల్లో పల్స్పోలియో చుక్కలను వేసినట్లు తెలిపారు. ఇందులో 4277మంది సిబ్బంది పాల్గొన్నట్లు ఆయన తెలిపారు.