ఆక్సిజన్ కొరత అనే మాటే వినిపించొద్దు
ABN , First Publish Date - 2021-05-08T05:25:37+05:30 IST
జిల్లాలో ఆక్సిజన్ కొరత అనే మాట వినబడవద్దని కలెక్టర్ సీ.నారాయణరెడ్డి అన్నారు. నగరంలోని దుబ్బప్రాంతంలో ఉన్న లక్ష్మీప్రసన్న ఆక్సీజన్ ప్లాంట్ ను శుక్రవారం ఆయన పరిశీలించారు.
నిజామాబాద్అర్బన్, మే 7: జిల్లాలో ఆక్సిజన్ కొరత అనే మాట వినబడవద్దని కలెక్టర్ సీ.నారాయణరెడ్డి అన్నారు. నగరంలోని దుబ్బప్రాంతంలో ఉన్న లక్ష్మీప్రసన్న ఆక్సీజన్ ప్లాంట్ ను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తేవాలని వాటిని వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్లాంట్ను బాగా నిర్వహించాలని జిల్లాలో ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలన్నారు. ఈ ఏజెన్సీ నుంచి మొత్తం నిజామాబాద్ నగరానికి ఆక్సిజన్ సప్లై చేయనున్నట్లు తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరఫరా చేయాలన్నారు. కలెక్టర్ వెంట డ్రగ్ ఇన్స్పెక్టర్, నోడల్ అధికారి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.