నిజామాబాద్లో రోడ్డు ప్రమాదం
ABN , First Publish Date - 2021-10-24T16:10:25+05:30 IST
జిల్లాలోని ఇందల్వాయి వద్ద జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.
నిజామాబాద్: జిల్లాలోని ఇందల్వాయి వద్ద జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. కారు టైరు పగిలి డివైడర్ను దాటుకుని లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా...మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు, క్షతగాత్రులు మోర్తాడ్ మండలం పాలెం వాసులుగా గుర్తించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.