బాధిత కుటుంబాలకు మంత్రి ప్రశాంత్రెడ్డి పరామర్శ
ABN , First Publish Date - 2021-06-11T05:06:49+05:30 IST
వేల్పూర్ మండలంలోని జాన్కంపేట్, పచ్చలనడ్కుడ, సాహెబ్పేట్ గ్రామాలలో వివిధ కారణాలతో మృతి చెందిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల కుటుంబాలను రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహనిర్మాణం, శాసనస భ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి గురువా రం రాత్రి పరామర్శించారు.
వేల్పూర్, జూన్ 10: వేల్పూర్ మండలంలోని జాన్కంపేట్, పచ్చలనడ్కుడ, సాహెబ్పేట్ గ్రామాలలో వివిధ కారణాలతో మృతి చెందిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల కుటుంబాలను రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహనిర్మాణం, శాసనస భ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి గురువా రం రాత్రి పరామర్శించారు. జాన్కంపేట్ గ్రామంలో ప్రస్తుత ఎంపీటీసీ చౌడ చందన్ తల్లి సౌడ రత్నమ్మ ఇటీవల మరణిం చడంతో చందన్ కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు. టీ ఆర్ఎస్ నాయకుడు కొలిప్యాక వినోద్రెడ్డి ఇటీవల మరణించ డంతో ఆయన తండ్రి కొలిప్యాక గంగారాం, తమ్ముడు సొసైటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి కుటుంబాన్ని, టీఆర్ఎస్ కార్యకర్త జైడి రాజ్కుమార్ కుటుంబాన్ని, అలాగే టీఆర్ఎస్ కార్యకర్త శె ట్టిపెద్ద తుక్కన్న ఇటీవల మృతిచెందడంతో ఆయన కుటుంబా న్ని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పరామర్శించారు. పచ్చలన డ్కుడలో మాజీ సర్పంచ్ సంతోష్పద్మ అమ్మ వేముల యము న ఇటీవల మృతి చెందడంతో ఆమె కుటుంబసభ్యులను, టీఆ ర్ఎస్ కార్యకర్త బొమ్మకంటి లింగాగౌడ్ మరణించడంతో ఆయ న కుటుంబాన్ని, అలాగే సాహెబ్పేట్ గ్రామంలో ఇటీవల బ్లా క్ ఫంగస్తో మరణించిన ఉట్నూర్ చిన్న గంగారాం కుటుంబా న్ని, ఇటీవల అనారోగ్యంతో మరణించిన తోట రవళి కుటుంబా న్ని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పరామర్శించి ఆ కుటుంబా లకు మనోధైర్యం కల్పించారు. మంత్రి వేంట డీసీసీబీ వైస్ చై ర్మన్ రమేష్రెడ్డి, ఎంపీపీ బీమ జమున, జడ్పీటీసీ భారతిరా కేష్చంద్ర, ఆయా గ్రామాల సర్పంచ్లు సౌడ ప్రేమలత రమే ష్, ఏనుగు శ్వేత గంగారెడ్డి, సుధాకర్గౌడ్, ఎంపీటీసీలు సౌడ చందన్, నోముల గంగారెడ్డి, గుడాల గంగాధర్, టీఆర్ఎస్ మ ండల పార్టీ అధ్యక్షుడు జైడి నాగాధర్రెడ్డి పాల్గొన్నారు.