గంజాయి పట్టివేత

ABN , First Publish Date - 2021-10-29T05:40:06+05:30 IST

అక్రమంగా గంజాయి అమ్ముతున్న ఒకరిని అరెస్టు చేసి 200 గ్రాముల గం జాయిని ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు.

గంజాయి పట్టివేత


సుభాష్‌నగర్‌, అక్టోబరు 28: అక్రమంగా గంజాయి అమ్ముతున్న ఒకరిని అరెస్టు చేసి 200 గ్రాముల గం జాయిని ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని అర్సపల్లిలో ఎక్సైజ్‌ సూ పరింటెండెంట్‌ నవీన్‌చంద్ర ఆదేశాల మేరకు సోదాలు నిర్వహించగా అర్సపల్లికి చెందిన షేక్‌ నజీర్‌పై అను మానం వచ్చి అదుపులోకి తీసుకొని విచారించారు. అ తని వద్ద 200 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీటీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ రఘునాథ్‌రెడ్డి తెలిపారు. అతడిని అరెస్టు చేసి బైక్‌ను సీజ్‌ చేసినట్లు తెలిపారు.
బోధన్‌లో..
బోధన్‌రూరల్‌ : బోధన్‌లో బుధవారం రాత్రి గంజాయి అమ్ముతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు సీఐ ప్రేమ్‌కుమార్‌ తెలిపారు. రాకాసిపేట రైల్వేస్టేషన్‌ ఏరియాలో పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా తిరుగుతున్న వెంకటి అనే వ్యక్తిని పట్టుకొని సోదా చేయగా అతడి వద్ద ఉన్న ప్లాస్టిక్‌ బ్యాగ్‌లో 150 గ్రాముల ఎండు గంజాయి లభ్యమైందన్నారు. వర్ని మండలం సిద్దాపూర్‌ తండాలో ముగ్గురు మహిళ వద్ద కొనుగోలు చేసి బోధన్‌లో అధిక ధరకు విక్రయించేందుకు తెచ్చినట్లు తమ విచారణ తేలిందని సీఐ తెలిపారు. వెంకటిని అరెస్టు చేసి రిమాండ్‌ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2021-10-29T05:40:06+05:30 IST