ముంబాజిపేటలో మేకలను చంపిన చిరుత
ABN , First Publish Date - 2021-01-18T05:08:01+05:30 IST
మండలంలోని ముంబాజిపేట అటవీ శివారులో శనివారం మేకల మందపై చిరుత దాడి చేసి మూడు మేకలను చంపినట్లు కాపరి తెలిపారు.
లింగంపేట, జనవరి 17: మండలంలోని ముంబాజిపేట అటవీ శివారులో శనివారం మేకల మందపై చిరుత దాడి చేసి మూడు మేకలను చంపినట్లు కాపరి తెలిపారు. గ్రామా నికి చెందిన బోయిని శ్రీను మేకలను మేపడానికి అడవికి వెళ్లగా అడవిలో చిరుత మేకల మందపైకి రాగా శ్రీను అక్క డి నుంచి పారిపోయాడు. మేకలు చిరుతను చూసి పరుగెత్త గా చిరుత మూడు మేకలను పట్టుకుని చంపిందని శ్రీను తెలిపారు. దీంతో పంట చేనులకు వెళ్లే రైతులు భయాందోళన చెందుతున్నారు. అటవీశాఖ అధికారులు మృతి చెందిన మేకల కు నష్టపరిహారం అందించాలని కోరుతున్నారు.