గూడ్స్‌ రైలు ఢీకొని 52 గొర్రెల మృతి

ABN , First Publish Date - 2021-10-29T06:21:16+05:30 IST

అంక్సాపూర్‌ శివారులో గూడ్స్‌ రైలు ఢీకొని 52గొర్రెలు మృతి చెం దాయి. బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి, అంక్సాపూర్‌కు చెందిన గొల్ల భోజన్న, ఆయన కుమారుడు చొన్న భోజేందర్‌ వారికి చెందిన గొర్రెలను నిత్యం లాగే గురువారం మేతకు తీసుకువెళ్లారు. అంక్సాపూర్‌ శివారులో కుకునూర్‌ గ్రామానికి వెళ్లే రోడ్డులోని 44వ జాతీయ రహదారి వంతెన కింద రైలు పట్టాలకు ఇరువైపులా గొర్రెలు మేత మేస్తున్నాయి. సాయంత్రం సుమారు 4గంటల సమయంలో కరీంనగర్‌ వైపు నుంచి నిజామాబాద్‌ వైపు వెళ్తున్న గూడ్స్‌ రైలు గొర్రెలను ఢీకొని వెళ్లింది. పట్టాలు లోయ ప్రాంతంలో ఉండడంతో గొర్రెలకు ఎటూ వెళ్లడానికి వీలు లేకుండా పోయింది.

గూడ్స్‌ రైలు ఢీకొని 52 గొర్రెల మృతి

వేల్పూర్‌, అక్టోబరు28: అంక్సాపూర్‌ శివారులో గూడ్స్‌ రైలు ఢీకొని 52గొర్రెలు మృతి చెం దాయి. బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి, అంక్సాపూర్‌కు చెందిన గొల్ల భోజన్న, ఆయన కుమారుడు చొన్న భోజేందర్‌ వారికి చెందిన గొర్రెలను నిత్యం లాగే గురువారం మేతకు తీసుకువెళ్లారు. అంక్సాపూర్‌ శివారులో కుకునూర్‌ గ్రామానికి వెళ్లే రోడ్డులోని 44వ జాతీయ రహదారి వంతెన కింద రైలు పట్టాలకు ఇరువైపులా గొర్రెలు మేత మేస్తున్నాయి.  సాయంత్రం సుమారు 4గంటల సమయంలో కరీంనగర్‌ వైపు నుంచి నిజామాబాద్‌ వైపు వెళ్తున్న గూడ్స్‌ రైలు గొర్రెలను ఢీకొని వెళ్లింది. పట్టాలు లోయ ప్రాంతంలో ఉండడంతో గొర్రెలకు ఎటూ వెళ్లడానికి వీలు లేకుండా పోయింది. దీంతో రైలు ఢీకొని 52 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. దీంతో రూ.5లక్షల వరకు నష్టం జరిగినట్టు బాధితులు వాపోయారు. అంక్సాపూర్‌ సర్పంచ్‌ ఎడ్ల రాజేశ్వర్‌రెడ్డి అందించిన సమాచారం మేరకు తహసీల్దార్‌ సతీష్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. 

Updated Date - 2021-10-29T06:21:16+05:30 IST